Skip to main content

Posts

Showing posts from October, 2021
      " తాతా, ఓ హాస్య పత్రికలో  మూర్ఖశిఖామణులు అంశం మీద ఓ హాస్య కథ రాయాలి. నీకు అలాంటి అనుభవం ఏదైనా ఉంటే చెప్పు" ఎనభై ఏళ్ల తాత మార్తాండరావుని, అడిగాడు అతని మనవడు మూర్తి.      " అంటే నేను మూర్ఖుడునని నీ అనుమానమా?" అడిగాడు తాత.      "అయ్యో, అది కాదు తాతా ! నేనన్నది అలాంటి వారి అనుభవాలు నీకేమైనా తెలుసా అనీ?"     "అలా అన్నావు బావుంది. నేను చిన్నతనంలో విన్న ఓ రాజు కథ చెబుతాను. మధ్యలో మూర్ఖంగా అడ్డు రాక, చిన్న పిల్లాడిలా శ్రద్ధగా విను" అని చెప్పడం మొదలెట్టాడు మార్తాండరావు.                                ***       అవి మార్కాపురం రాజ్యాన్ని మార్కండేయ వర్మ పరిపాలిస్తున్న రోజులు. అతని మూర్ఖపు పనుల వలన ఆ రాజ్యంలో ప్రజలెవరూ సుఖంగా లేరు. ఎందుకంటే..    గురుకులంలో చదువుకుంటున్న పండితుల పిల్లలను సైన్యంలో చేరమనీ,      అలాగే సైన్యంలో పనిచేస్తున్న వారిని గురుకులాలకి వెళ్లి చదువుకొమ్మనీ,      ఏ రైతుదైనా పంట పండక ప...