సంకెళ్ళు – మంజరి ముందుమాట మంజరి గారి పేరు పాఠకులకు సుపరిచితం. వివిధ దిన, వార, మాసపత్రికల్లో మంజరి కథలు, సీరియల్స్ పాఠకులు చదివే ఉంటారు. వారి తాజా కథల సంపుటిలో పది కథలు, ఆరు పుస్తక పరిచయాలు ఉన్నాయి. ఇవన్నీ మనసుని తాకేవే. ‘ చూపున్న మనిషి ‘ మిలిటరీ నేపథ్యం తెలిసినవారు మాత్రమే రాయగలిగే కథ. తమ దేశ జాతీయ జండా రెపరెపలాడటానికి సైనికులు చేసే త్యాగం ఈ కథలో ప్రధాన అంశం. కెప్టెన్ బాత్రా పాత్ర కల్పితం కాదు. కార్గిల్ యుద్ధంలో తన సబార్డినేట్ ని రక్షించడం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఆ యుద్ధంలో అసువులు బాసిన అమరవీరుల జాబితాలో ఆ పరమవీరచక్ర పొందినట్టు ఇతనిపేరు నమోదై ఉంది.ఈ సంపుటిలోని చాలా కథలు, కలంతో కాక హృదయంతో చెప్పిన కథలు. `సంకెళ్ళు‘ కథ ఈ కోవకి చెందుతుంది. ఓ పోలీస్ ఎస్కార్టు ఇన్ఛార్జి, కోర్టుకి హాజరు పరిచిన ఒక ముద్దాయి ప్రధాన పాత్రలుగా సాగిన కథ. ఇది మానవ సంబంధాలను లోతుగా చర్చిస్తుంది. చివరలో అద్భుతమైన వాక్యాలు కథకి నిండుదనాన్ని, బహుమతిని తెచ్చి పెట్టాయి. ఇలాంటి కథ రాయాలంటే రచయిత హోమ్ వర్క్ చెయ్యాలి. ఈ కథ ఆ సంగతిని మనకి గుర్తు చేస్తుంది. ...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!