కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. పుత్ర సంతానం కోసం వారు కశ్యపుని ప్రార్థించారు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహం గల వెయ్యి మంది కుమారులు కావాలని కోరింది. వినత కద్రువ కుమారులకంటే బలవంతులైన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. వినత,కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు కలిగాయి. కొంతకాలానికి కద్రువకు కలిగిన అండాలు పగిలి అందులోనుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు బయటకు వచ్చాయి. కానీ వినతకు కలిగిన అండాలు ఎంతకూ పగల లేదు. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని అండాలలో ఒక అండాన్ని బలవంతంగా చిదిమింది. అందులో నుండి నడుము కింద దేహము లేని అనూరుడు పుట్టాడు. అనూరుడు తల్లి వినతను చూసి "ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావం కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు" అని శపించి "అమ్మ అ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు అందులో నుండి పుట్టబోయే వాడు మహా బలవంతుడు. నీ దాసీత్వాన్ని పోగొడతాడు" అని చెప్పి అనూరుడు సూర్యభగవానుడ...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!