Skip to main content

Posts

Showing posts from December, 2020

గరుత్మంతుడు

      కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత భార్యలు. పుత్ర సంతానం కోసం వారు కశ్యపుని ప్రార్థించారు. కద్రువ తనకు ప్రకాశవంతులైన పొడవైన దేహం గల వెయ్యి మంది కుమారులు కావాలని కోరింది. వినత కద్రువ కుమారులకంటే బలవంతులైన ఇద్దరు కుమారులు కావాలని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేశాడు.      వినత,కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు కలిగాయి.        కొంతకాలానికి కద్రువకు కలిగిన అండాలు పగిలి అందులోనుండి వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పాలు బయటకు వచ్చాయి. కానీ వినతకు కలిగిన అండాలు ఎంతకూ పగల లేదు. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని అండాలలో ఒక అండాన్ని బలవంతంగా చిదిమింది. అందులో నుండి నడుము కింద దేహము లేని అనూరుడు పుట్టాడు. అనూరుడు తల్లి వినతను చూసి "ఎందుకమ్మా తొందరపడి అండాన్ని చిదిమావు. సవతి మత్సరంతో అండాన్ని చిదిమావం కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు" అని శపించి "అమ్మ అ రెండవ అండాన్ని జాగ్రత్తగా కాపాడు అందులో నుండి పుట్టబోయే వాడు మహా బలవంతుడు. నీ దాసీత్వాన్ని పోగొడతాడు" అని చెప్పి అనూరుడు సూర్యభగవానుడ...

రురుడు

             భృగుమహర్షి  భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు భృగువు అగ్నిహోత్రునితో తన భార్యను చూస్తూ ఉండమని చెప్పి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు.  ఆ సమయంలో అక్కడికి పులోముడు అనే రాక్షసుడు వచ్చాడు. పులోమను చూసి మోహించాడు.              ఈమె ఎవరిని అగ్నిహోత్రుని అడిగాడు.  అగ్ని సంకటంలో పడ్డాడు. ఎందుకంటే ఈ పులోమను మొదట ఈ రాక్షసుడు వివాహం చేసుకోవాలనున్నాడు. కానీ  పులోమ తండ్రి  అందుకు అంగీకరించక, భృగువుతో వివాహం జరిపించాడు. అయినా నిజం చెప్పడానికే నిర్ణయించుకున్నాడు.        "ఈమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్పాడు అగ్నిదేవుడు. పులోముడు ఆమెను గుర్తుపట్టాడు వెంటనే వరాహ రూపం ధరించి ఆమెను భుజం మీద వేసుకొని పారిపోయాడు. అలా వెళుతున్నప్పుడు ఆమెకు ప్రసవం అయ్యింది. బిడ్డ కింద పడ్డాడు. అలా తల్లి గర్భమునుండి జారిపడి వాడు కాబట్టి అతనికి చ్యవనుడు అని పేరు వచ్చింది. తల్లి గర్భమునుండి  జారిపడిన చ్యవనుడు కళ్ళు తెరవగానే ఆ తీక్షణమైన చూపులకు తట్టుకోలేక పులోముడు భస్మమయ్యాడు. ...