పల్లవి: మణికంఠుని మాల వేద్దాం ఓ స్వామి కన్నె స్వామి మనలోని నీరసాన్ని వదిలేద్దాం మణికంఠుని మాల వేద్దాం ఓ స్వామి నా స్వామి మనలోని తామసాన్ని తరిమేద్దాం క్రమశిక్షణ నైవేద్యంగా కోరు దేవుడు బంజరులో బ్రతుకు బాట తీర్చేటి దేవుడు ||మణి|| చరణం: తెల్లవారక ముందే చన్నీటి స్నానాలు కాయాన్ని కష్టానికి శృతి చేయు వైనాలు మేలుకొలుపు మణికంఠుని మధురమైన గానాలు సడిన సోలు వీనులకు సరియైన బోనాలు ||మణి|| చరణం: స్వామీ స్వామీ అంటూ అందరినీ పిలవాలి మనుషులంతా ఇలలోన ఒకటియనీ తలవాలి నేలపైన పవళింపు నిత్యమూ చేయాలి నేలతల్లి ఒడి తోడు చివరదని తెలియాలి ||మణి|| చరణం: నల్లని వలువలూ శనీశ్వరుని చరణాలు దీక్ష ముగిసినాక చేరు అయ్యప్ప చరణాలు అయ్యప్పా అయ్యప్పని శరణు వేడితే మన ఇంట ప్రసరించు ఆ దైవ కిరణాలు ||మణి||