Skip to main content

Posts

భగత్ సింగ్

 భగత్ సింగ్ (Bhagat Singh), 1907 సెప్టెంబరు 28న జన్మించి, 1931 మార్చి 23న మరణించిన ఒక ప్రసిద్ధ భారత స్వాతంత్ర్య సమరయోధుడు మరియు విప్లవకారుడు. ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు, "విప్లవం వర్ధిల్లాలి" అనే నినాదాన్ని ఇచ్చాడు.  జననం: 1907 సెప్టెంబరు 28న, ప్రస్తుత పాకిస్తాన్‌లోని లాయల్‌పూర్ జిల్లా (ఇప్పుడు ఫైసలాబాద్)లోని 105 చక్ బంగా గ్రామంలో జన్మించాడు.  తండ్రి: కిషన్ సింగ్.  తల్లి: విద్యావతి.  మరణం: 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీయబడ్డాడు.  విప్లవకారుడు: భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత ప్రభావవంతమైన విప్లవకారులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.  ప్రభావం: వలస పాలన నుండి భారతదేశాన్ని స్వాతంత్ర్యం వైపు నడిపించే వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం వల్ల భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంపై గొప్ప ప్రభావాన్ని చూపాడు.  ప్రసిద్ధి: ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు, "విప్లవం వర్ధిల్లాలి" అనే నినాదాన్ని ఇచ్చాడు.  లాహోర్ కుట్ర కేసు: లాహోర్ కుట్ర కేసులో సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌లకు మరణశిక్ష విధించబడింద...
Recent posts

Song on Ayyappa

  పల్లవి: మణికంఠుని మాల వేద్దాం  ఓ స్వామి కన్నె స్వామి  మనలోని నీరసాన్ని వదిలేద్దాం మణికంఠుని మాల వేద్దాం  ఓ స్వామి నా స్వామి మనలోని తామసాన్ని తరిమేద్దాం  క్రమశిక్షణ నైవేద్యంగా కోరు దేవుడు  బంజరులో బ్రతుకు బాట తీర్చేటి దేవుడు ||మణి|| చరణం: తెల్లవారక ముందే చన్నీటి స్నానాలు కాయాన్ని కష్టానికి శృతి చేయు వైనాలు మేలుకొలుపు మణికంఠుని మధురమైన గానాలు సడిన సోలు వీనులకు సరియైన బోనాలు  ||మణి|| చరణం: స్వామీ స్వామీ అంటూ అందరినీ పిలవాలి  మనుషులంతా ఇలలోన ఒకటియనీ తలవాలి  నేలపైన పవళింపు నిత్యమూ చేయాలి  నేలతల్లి ఒడి తోడు చివరదని తెలియాలి  ||మణి|| చరణం: నల్లని వలువలూ శనీశ్వరుని చరణాలు  దీక్ష ముగిసినాక చేరు అయ్యప్ప చరణాలు  అయ్యప్పా అయ్యప్పని శరణు వేడితే మన ఇంట ప్రసరించు ఆ దైవ కిరణాలు  ||మణి|| 

Song on Parents Love

తల్లిదండ్రుల ప్రేమ  పల్లవి : అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ కన్నా  అవనిలోన మిన్న ఏముందిరా కన్నా  అమ్మంటే అనురాగం కురిపించే ఒక మేఘం  నాన్నంటే మమకారం నీ కంటికి ప్రాకారం  నైవేద్యం కోరని దేవత ఇలలోన అమ్మంటే  కోరకున్న వరములు ఇచ్చే కులదైవం నాన్నంటే  ||అమ్మ ప్రేమ|| చరణం : బుడిబుడి అడుగులతో నడిచి బడలోకి నువ్వు వెళుతుంటే  తమ ప్రాణాలను నీ వెంటే నీడగా నీతో పంపారు  అమ్మానాన్నల అరికాళ్ళే అమరేను నీకు మేజోళ్ళు ఎండావానా తమ పాలే అందేను నీకు మురిపాలు  అడుగులే జారిన గుండెలోన దిగు గునపాలే కన్నులే వాలినా  కుమిలి పోవు తమ కనుపాపే ఇంతకన్న విలువైన ప్రేమ కనిపించేనా ముల్లోకాల్లో  ||అమ్మ ప్రేమ|| చరణం : సూటూబూటూ నీకేసి దొరబాబులాగ నిను చూసి చేతి మిషనుతో అతుకేసి చిరుగు బట్టలతో గడిపారు  ఉన్నత చదువులు చదివించి ఉన్నవాడిగా నిను పెంచి సన్నని బియ్యం తినిపించి సద్దిబువ్వనూ తిన్నారు  వంటినే వింటిగా పంపినారు ముందుకు నిన్ను  వాలితే మధ్యలో విరిగిపోక ఉందా వెన్ను ఇంతకన్న విలువైన ప్రేమ కనిపించేనా ముల్లోకాల్లో  ||అమ్మ ప్రేమ||

Story of Snakes and Eagle

కృతయుగంలో కశ్యపప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి " మీకు ఎలాంటి సంతానం కావాలి" అని అడిగాడు. కద్రువ తనకు "ప్రకాశ వంతులైన, పొడవైన దేహముగల వెయ్యి మంది కుమారులు కావాలి" అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు "కద్రువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి" అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండ ములు (eggs), వినతకు రెండు అండములు కలిగాయి. వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు.. కొంత కాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి, అందులోనుండి, వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు (పాములు) బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని, రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది. అందులో నుండి, అపరార్ధ కాయవిహీనుడు (నడుము కింద దేహము లేని వాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహముకలవాడు, బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి విన...