పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు తన సేనలతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయి సమీపంలో ఉన్న వశిష్ట మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజుకు అతిధి సత్కారాలు గావించాడు.
వశిష్టుని వద్ద నందిని అనే ఒక కామధేనువు ఉంది. విశ్వామిత్రునికి అతని అపార సేన వాహినికి భోజన సత్కారాలు చేయమని నందిని చెప్పాడు. నందిని వారందరికీ ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.
లక్ష పాడి ఆవులను ఇస్తానని ఆ కామధేనువును తనకిమ్మని అడిగాడు విశ్వామిత్రుడు. వశిష్టుడు నిరాకరించాడు. బలవంతంగా ఆ కామధేనువును తీసుకురమ్మని తన సేనను ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. నందిని వశిష్ఠుని వైపు చూసింది. వశిష్ఠుడు మౌనంగా చూస్తున్నాడు. నందిని విజృంభించింది. తన శరీరం నుండి సైన్యాలను పుట్టించింది. ఆ సైన్యాలు విశ్వామిత్రుని సైన్యాలను చీల్చి చెండాడారు. విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయ్యింది. క్షాత్ర బలం కన్నా తపోబలం గొప్పదని తెలుసుకున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోయాడు. దివ్య శక్తులు పొందాడు. కానీ వశిష్ఠుని మీద మత్సరం మానలేదు. వశిష్ఠుడు కల్మాషపాదుని అనే రాజుకు యజ్ఞములు చేయించే పురోహితులుగా ఉంటున్నాడు. ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని విశ్వామిత్రుడు ప్రయత్నిస్తున్నాడు ఒకరోజు కల్మాషపాదుని వేటకు వెళ్లాడు అలసిపోయి సమీపంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. దారిలో వశిష్టుని నూరు మంది కుమారులు పెద్దవాడైన శక్తి ఎదురుగా వస్తున్నాడు. కల్మాషపాదుడు గర్వంతో శక్తిని తప్పుకొని తనకు దారి ఇమ్మన్నాడు. శక్తి దారి ఇవ్వక పోయేసరికి కల్మాషపాదుడు తన చేతికర్రతో శక్తిని కొట్టాడు. శక్తికి కోపం వచ్చి, నన్ను రాక్షసబుద్ధితో అవమానించావు. కాబట్టి నువ్వు రాక్షసుడివై నర మాంసం తింటూ జీవించమని శాపం ఇచ్చాడు. అప్పుడు కళ్ళు తెరిచిన కల్మాషపాదుడు అతనిని వశిష్టుని పెద్దకుమారుడుగా గుర్తించాడు. శాపవిమోచనం ప్రార్ధించాడు.
ఇదంతా దూరం నుండి చూస్తున్న విశ్వామిత్రుడు కల్మాషపాదుని మనసులోకి కికరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటినుండి కల్మాషపాదుడు రాచకార్యాలు మాని వేశాడు.
ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మాషపాదుని వద్దకు వచ్చాడు. తనకు మాంసాహారం కావాలని అడిగాడు. కల్మాషపాదుని ఒప్పుకున్నాడు కానీ మరిచిపోయాడు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే వంట వాడిని పిలిచి ఒక బ్రాహ్మణుడికి మాంసాహారం భోజనం కావాలి, తయారు చేయమని చెప్పాడు. వాడు ఇంత రాత్రి మాంసం ఎక్కడ దొరుకుతుందని అన్నాడు. అప్పటికే కింకరుడు కల్మాషపాదుని మనసులో ఆవేశించి ఉండటంవల్ల నర మాంసమైనా వండి పెట్టుమన్నాడు.
నర మాంసం వండి పెట్టిన విషయం బ్రాహ్మణ తెలిసిపోయింది. ఆ బ్రాహ్మణుడు కోపంతో నరమాంసంతో తనకు భోజనం పెట్టాడు కాబట్టి కల్మాషపాదుని నర మాంసం తినే రాక్షసుడిగా బ్రతకమని శాపం పెట్టాడు. కల్మాషపాదుడు రాక్షసుడిగా మారిపోయాడు. దీనికంతా కారణం వశిష్టుని కుమారుడు శక్తి కాబట్టి మొదటిగా శక్తిని చంపి తిన్నాడు. తర్వాత మిగిలిన పుత్రులని కూడా తిన్నాడు.
ఒకరోజు రాక్షస రూపం లో ఉన్న కల్మాషపాదుడు, గర్భవతి అయిన శక్తి భార్య అదృశ్యంతి మీద పడి చంపిబోయాడు. వశిష్ఠుడు కల్మాషపాదుని పై మంత్ర జలం చల్లాడు. కల్మాషపాదుడు శాప విముక్తుడయ్యాడు.
కొంతకాలానికి అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు. పరాశరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తన తండ్రి శక్తిని ఒక రాక్షసుడు చంపాడని తెలుసుకొన్నాడు. తన తండ్రి, పినతండ్రులను చంపిన రాక్షసుల మీద కోపంతో సత్రయాగం చేశాడు. ఆ యాగం చేస్తున్నప్పుడు రాక్షసులంతా ఆ యాగంలో పడి మలమలమాడిపోతూ ఉన్నారు. అలా రాక్షస జాతి అంతరించిపోతుంటే పులస్త్యుడు, పులహుడు, క్రతువు వశిష్టుని దగ్గరకు వచ్చి యాగాన్ని ఆపమని కోరారు. వశిష్ఠుని కోరిక మేరకు పరాశరుడు సత్ర యాగాన్ని, రాక్షస వినాశనాన్ని ఆపు చేశాడు.
Comments
Post a Comment