గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవడం ఇష్టం లేదు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు ఇంకా సాధించాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ను భంగం చేయాలని దేవేంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. శరద్వంతుడు ఆమెను చూసి పరవశుడయ్యాడు. కామోద్రేకంలో అతనికి వీర్యస్కలనం అయ్యింది. అతని వీర్యం ఒక రెల్లు పొదల్లో రెండు భాగాలుగా పడింది. రెండు భాగాల నుంచి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు. వేటకు వెళ్ళినప్పుడు ఈ బిడ్డను చూసి శంతన మహారాజు తనతో పాటు తీసుకు వచ్చి పెంచుకున్నాడు. వారికి కృపుడు, కృపి అని పేర్లు పెట్టాడు. కొంతకాలం తర్వాత శరద్వంతుడు శంతనుని వద్దకు వచ్చి ఆ పిల్లలు తమ సంతానం అని తెలిపిత స్వయంగా కృపునికి ధనుర్విద్య నేర్పాడు.
Comments
Post a Comment