దేశదేశాల రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎలుక రాజు కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పనని తిరస్కరించాడు. ఏకలవ్యుడు నిరాశతో వెళ్ళిపోయాడు.
కొంతకాలం తర్వాత కౌరవులు పాండవులు వేట నిమిత్తం సమీపంలోని అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన కుక్క ఒకటి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతన్ని చూసి మొరగసాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి కుక్క నోటిలో కొట్టాడు. తిరిగి వచ్చిన కుక్కను చూసి రాకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలు ఎవరు వేశారని వెతుకుతూ అడవులోకి వెళ్ళారు. వారికి ద్రోణాచార్యుని మట్టి విగ్రహం ముందు విలువిద్య సాధన చేస్తున్న ఏకలవ్యుడు కనిపించాడు. ఏకలవ్యుడు రాకుమారులతో తన పేరు ఏకలవ్యుడని, ద్రోణాచార్యుడు తన గురువని చెబుతాడు. రాకుమారులు అక్కడి నుంచి తిరిగి వచ్చి గురువు ద్రోణాచార్యుడుకి ఏకలవ్యుని గురించి చెబుతారు.
అర్జునుడు తనకంటే మేటి అయిన విలుకాడిని చూసి భరించలేక పోతాడు. ద్రోణుడిని ఒంటరిగా కలుసుకొని "నేనే తమ ప్రియశిష్యుడన్నారు.అని విద్యలూ నేర్పించానన్నారు కానీ ఎరుకలవాడు తమకు ప్రియ శిష్యుడు అట కదా.. అతనికి నాకన్నా విలు విద్యలో నైపుణ్యం ఎక్కువట"అని ఈర్ష్యగా అడిగాడు.
ద్రోణుడికి ఇదేమీ అర్థం కాలేదు అర్జునుడు వెంటనే కలిగి ఉండే ప్రదేశానికి వెళ్ళాడు ఏకలవ్యుడు ద్రోణుడికి నమస్కరించి "అయ్యా నేను తమ శిష్యుణ్ణి. తమరు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పని అంటే నేను ఆ కోరికను అణచుకోలేక మీ రూపాన్ని విగ్రహంగా మలుచుకుని ఆ విగ్రహం ముందు తదేకంగా సాధన చేసి నేర్చుకున్నాను" అని చెప్పాడు.
అప్పుడు ద్రోణుడు కపట బుద్ధితో గురుదక్షిణగా ఏకలవ్యుడి కుడిచేతి బొటనవేలు ఇవ్వమని అడిగాడు. ఏకలవ్యుడు సరేనని తన కుడి చేతి బొటన కోసి ఇచ్చాడు. బొటనవేలు తెగిపోవడంతో ఒక మేటి విలుకాడి విలువిద్య అడవిలోనే ఆగిపోయింది.
Comments
Post a Comment