Skip to main content

భీష్ముని పూర్వ వృత్తాంతం

                                       అష్ట వసువుల శాపం


            వరుణుడి కుమారుడైన వశిష్ఠుడు మేరు పర్వత గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్టుని ఆశ్రమంలో నందిని అనే కామధేనువు ఉంది అది వశిష్టునికి కావలసిన అన్నింటిని అందిస్తూ సేవ చేస్తూ ఉంది.

           వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చిన అష్ట వసువులు ఆ కామధేనువు మహిమ చూసి ఆశ్చర్యపోయారు. ఎనిమిదవ వసువు ప్రభాసుని భార్య ఆ కామధేనువును తన ప్రాణ స్నేహితురాలికి కానుకగా ఇవ్వాలని కోరికగా ఉందని అడిగేసరికి ప్రభాసుడు కామధేనువుని వశిష్టునికి తెలియకుండా తీసుకువెళతాడు.

           వశిష్టుడు తన యోగ దృష్టితో చూసి ఈ పని వసువులదని గ్రహించి వారందరిని మానవులై పుట్టమని శపించాడు. అందరూ వశిష్ఠుని కాళ్ళ మీద పడి భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని వేడుకున్నారు. అందుకు వశిష్టుడు అంగీకరించి అలాగే జరుగుతుంది. కానీ అసలు నేరం చేసిన వాడు ఈ ప్రభాసుడు. కాబట్టి వాడు మాత్రం చిరకాలం మానవ లోకంలో సంతాన హీనుడిగా బతుకుతాడని చెబుతాడు. ఈ ప్రభాసుడే భీష్ముడు.

                మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                    

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...