పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే అతను వెయ్యి అశ్వమేధయాగాలు, నూరు రాజసూయ యాగాలు చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ దేవతలు మహాపురుషుల తోనూ ఉంటూ బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు.
ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచడం వల్ల గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి ఆమె తొడలు కనబడ్డాయి. అప్పుడు దేవతలంతా తల పక్కకు తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం ఆసక్తిగా ఆమె వైపే చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు దీన్ని గమనించి మహాభిషునికి భూలోకంలో మానవ స్రీకి జన్మించమని శాపం ఇచ్చాడు.
తన తప్పు తెలుసుకున్న మహాభిషుడు. "భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు. అతని కొడుకుగా జన్మించేటట్లు అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. బ్రహ్మ దేవుడు అందుకు సమ్మతించాడు. ఈ మహాభిషుడు ప్రతీపునికి శంతనుడిగా జన్మించాడు
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!
Comments
Post a Comment