Skip to main content

శంతనుని పూర్వ వృత్తాంతం

                                     శంతనుడు

         పూర్వం ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే అతను వెయ్యి అశ్వమేధయాగాలు, నూరు రాజసూయ యాగాలు చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి అక్కడ దేవతలు మహాపురుషుల తోనూ ఉంటూ బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచడం వల్ల గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి ఆమె తొడలు కనబడ్డాయి. అప్పుడు దేవతలంతా తల పక్కకు తిప్పుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం ఆసక్తిగా ఆమె వైపే చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు దీన్ని గమనించి మహాభిషునికి భూలోకంలో మానవ స్రీకి జన్మించమని శాపం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్న మహాభిషుడు. "భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు. అతని కొడుకుగా జన్మించేటట్లు అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. బ్రహ్మ దేవుడు అందుకు సమ్మతించాడు. ఈ మహాభిషుడు ప్రతీపునికి శంతనుడిగా జన్మించాడు
                              మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి

                                             

Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

తెలుగు సంధులు

                    తెలుగు   సంధులు సంధి వివరణ:                  మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే మార్పును  సంధికార్యము   అని అంటారు.   సంధిలో రెండు పదాలు ఉంటాయి. వీటిల...

సంస్కృత సంధులు

                                           సంస్కృత సంధులు సంధి వివరణ:                    మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి   మరో పదం కలిపి మాట్లాడతాం. ఇది అప్రయత్నంగా జరుగుతుంది.    'ఆయన ఎక్కడ ఉన్నారు?' అనే వాక్యంలో ఆయన, ఎక్కడ, ఉన్నారు అనే మూడు పదాలున్నాయని తెలుస్తుంది. ఈ వాక్యాన్ని వేగంగా మాట్లాడినప్పుడు ఆయనెక్కడున్నారు? అని ఒక పదం గా ఏర్పడింది. ఇక్కడ పరిశీలిస్తే పదాలు విడివిడిగా ఉన్నప్పుడు కంటే కలిసి ఉన్నప్పుడు వర్ణాలలో మార్పు కనిపిస్తుంది. ఎలా రెండు పదాలు కలిసిన చోట వర్ణాలలో మార్పు కనిపిస్తే దానిని  సంధి  అంటారు.                   ఉచ్చారణ సౌలభ్యం కోసం రెండు పదాలను వెంటవెంటనే కలిపి మాట్లాడవలసి, రాయవలసి వచ్చినప్పుడు సంధి పదం ఏర్పడుతుంది.  వ్యాకరణ పరిభాషలో రెండు అచ్చుల కలయికను  సంధి  అని, ఆ రెండు అచ్చుల మధ్య జరిగే...