నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు. వారిద్దరూ బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి వారు తమకు కోరిన రూపం ధరించేటట్లు, వేరే వాళ్ళ చేతిలోను చావు లేకుండా, ఎప్పటికీ చావు లేకుండా వరం కావాలని అడిగారు. కానీ బ్రహ్మదేవుడు వారికి చావు లేకుండా ఉండే వరం తప్ప మిగిలిన అన్ని వరాలు ప్రసాదించాడు. బ్రహ్మ వర ప్రసాదంతో వారు చెలరేగి పోయారు. భూలోకంలో ఉన్న బ్రాహ్మణులను రాజులను బాధ పెట్ట సాగారు. వారి బాధ భరించలేక మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి వారి బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకున్నారు. దానికి బ్రహ్మదేవుడు ఆలోచించాడు. వాళ్ళు వేరే వాళ్ల చేతిలో చావు లేకుండా వరం అడిగాడు కానీ ఒకరి చేతిలో ఒకరు చావకుండా వరం అడగలేదు కదా.. అని ఆలోచించి, విశ్వకర్మను పిలిచి ఒక అందమైన స్త్రీని సృష్టించనున్నాడు. విశ్వకర్మ ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించాడు. ఆ సుందరి పేరు తిలోత్తమ. ఆమె బ్రహ్మ ముందు నిలబడి తనను సృష్టించిన కారణం ఏమిటని అడిగింది. బ్రహ్మదేవుడు ఆమెకు సుందోపసుందులు గురించి చెప్పి వారిలో వారికి కలహం పెట్టి ఒకరిని ఒకరు కొట్టుకొని మరణించే టట్టు చేయమని చెప్పాడు.
తిలోత్తమ అలాగే అని భక్తితో బ్రహ్మదేవునికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది. తిలోత్తమ తనకు ప్రదక్షణ చేస్తుంటే, తన తలను నలుదిశలా తిప్పుతూ తిలోత్తమ అందాలని వీక్షించాడు అప్పటినుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అయ్యాడు.
తిలోత్తమ అందానికి దేవేంద్రుడు కూడా ముగ్ధుడయ్యాడు. ఆ అందం చూడడానికి రెండు కాళ్ళూ చాలక ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని చూశాడు. అప్పటినుండి దేవేంద్రుడు సహస్రాక్ష అయ్యాడు.
తిలోత్తమ సుందోపసుందులు వద్దకు వెళ్ళింది. ఆమెను చూసి సుందోపసుందులు కామమోహితులయ్యారు. ఇద్దరూ తిలోత్తమను కామించారు. తిలోత్తమ నాది అంటే నాది అని చెరో చేయి పట్టుకుని లాగుతున్నారు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు అని ఆమెను బలవంతం చేశారు. దానికి తిలోత్తమ, నేను మీలో ఎవరిని ప్రేమించాలో తెలుసుకోవాలంటే మీలో మీరు యుద్ధం చేయండి మీలో ఎవరు గెలుస్తారో వారిని నేను ప్రేమిస్తాను అని చెప్పింది. వారిలో విచక్షణా జ్ఞానం నశించింది. ఒక స్త్రీ కోసం ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నారు. ఇద్దరూ బలవంతులే కాబట్టి ఒకరి చేతిలో ఒకరు చచ్చారు.
Comments
Post a Comment