Skip to main content

మాయాచదరం

               ఇది ఒక మేజిక్ స్క్వేర్. తెలుగులో మాయా చదరం అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఒక అడ్డు(నిలువు) వరుసలోని అంకెల( సంఖ్యల ) మొత్తం ఎంత ఉంటుందో మిగిలిన అడ్డు(నిలువు) వరుసల్లోని అంకెల( సంఖ్యల ) మొత్తాలు కూడా అంతే ఉంటాయి. కర్ణాలలోని (మూలలు) అంకెల( సంఖ్యల ) మొత్తాలు కూడా సమానంగా ఉంటాయి . అందుకే దీన్ని మేజిక్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు మనం ఆటలోకి వద్దాం. 
            1 నుంచి 9 అంకెలను మాత్రమే ఉపయోగించాలి. ఉపయోగించిన అంకెను మళ్ళీ ఉపయోగించకూడదు. నిలువు వరుసలు, అడ్డు వరుసలు, కర్ణాలు కూడినా 15 రావాలి. ఎనిమిది విధాలుగా నింపవచ్చు.  ప్రయత్నించండి. అన్నీ గళ్ళను నింపాక check button మీద click చేస్తే కరెక్టు అయిన గళ్ళు green colourలోనూ , తప్పైన గళ్ళు red colourలోను కనిపిస్తాయి. 







Comments

Popular posts from this blog

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం - పర్వాలు (తెలుగు)

                                     తెలుగులో మహాభారతాన్ని ఆదికవి  నన్నయ  ఆదిపర్వం  మొదలుకుని అరణ్య పర్వంలో కొంత వరకు అంటే  రెండన్నర పర్వం  రాశారు. తరువాత కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు   తిక్కన  విరాటపర్వం నుంచి చివరి పర్వం స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం  పదిహేను పర్వాలను  రాసారు.  చివరిగా  ప్రబంధ పరమేశ్వరుడు  ఎర్రన , నన్నయ రాయగా మిగిలిన  అరణ్యపర్వ శేష  భాగాన్ని పూర్తి చేశాడు   1. ఆది పర్వము  2. సభా పర్వము  3. అరణ్య పర్వము   4. విరాట పర్వము  5. ఉద్యోగ పర్వము  6.  భీష్మ పర్వము  7.ద్రోణ పర్వము  8.కర్ణ పర్వము  9.శల్య పర్వము  10. సౌప్తిక పర్వము  11. స్త్రీ పర్వము  12. శాంతి పర్వము  13. అనుశాసనిక పర్వము         14. అశ్వమేధ పర్వము  15. ఆశ్రమ వాస పర్వము  16. మౌసల పర్వము  17. మహా ప్రస్థాన పర్వము...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...