దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సము ద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వ తాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చ యించారు.
సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆదికూర్మాను మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిల బడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేసారు. తల వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టుకొని సము ద్రాన్ని చిలకడం ఆరంభించారు.
మొట్ట మొదట సముద్రంలోనుండి హాలా హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠం లో నిలుపుకున్నాడు.
తరువాత, లక్ష్మీ దేవీ, కౌస్తుభ మణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన పక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు, పుట్టాయి. వాటిని మహేం ద్రుడు స్వీకరించాడు. తరువాత అమృత కలశము పుట్టింది. ఆ అమృత కలశాన్ని రాక్షసులు స్వీకరిం చారు. కాని విష్ణుమూర్తి, మోహినీ రూపంతో రాక్షసులను వంచించి, ఆ అమృత కలశాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతం తాగడానికి దేవతలు అందరూ కూర్చున్నారు.
రాహువు అనే రాక్షసుడు దేవతల రూపం ధరించి వారితో పాటు అమృతం తాగడానికి కూర్చున్నాడు. రాహుపుకు అమృతం ఇచ్చే సమయంలో ఈ విష యాన్ని సూర్యుడు, చంద్రుదు గుర్తించారు. వెంటనే విష్ణువుకు ఈవిషయం చెప్పారు. విష్ణువు తన చక్రాయుధంతో రాహువు తల తెగ నరికాడు.
కానీ అప్పటికే అమృతం రాహువు కంఠం దాకా వెళ్లింది కాబట్టి, తల మాత్రం అమృతత్వాన్ని సంతరించుకుంది. మొండెం మాత్రం తల నుండి వేరై పడిపోయింది. అప్పటి నుండి రాహుపుకు, సూర్య చంద్రులకు బద్ధ వైరం ఏర్పడింది.
దేవ దావన యుద్ధం జరిగింది. దేవతల పక్షాన నరుడు, నారాయణుడు యుద్ధం చేసారు. వాళ్ల ధాటికి రాక్షసులు తట్టుకోలేక పోయారు. ఓడి పోయారు. సముద్రంలోకి పారి పోయారు. దేవతలు విజయం సాధించారు. మంధర పర్వతాన్ని ఇది వరకు ఉన్న చోట పెట్టారు. స్వర్గానికి వెళ్లి సుఖంగా ఉన్నారు. అమృత కలశాన్ని దేవేంద్రునికి ఇచ్చారు. దేవేంద్రుడు అమృత కలశాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు.
Comments
Post a Comment