Skip to main content

Posts

Showing posts from July, 2023

Story of Snakes and Eagle

కృతయుగంలో కశ్యపప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి " మీకు ఎలాంటి సంతానం కావాలి" అని అడిగాడు. కద్రువ తనకు "ప్రకాశ వంతులైన, పొడవైన దేహముగల వెయ్యి మంది కుమారులు కావాలి" అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు "కద్రువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి" అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండ ములు (eggs), వినతకు రెండు అండములు కలిగాయి. వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు.. కొంత కాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి, అందులోనుండి, వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు (పాములు) బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని, రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది. అందులో నుండి, అపరార్ధ కాయవిహీనుడు (నడుము కింద దేహము లేని వాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహముకలవాడు, బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి విన...

Story of Pariskhittu

  అర్జునుని కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి భార్య ఉత్తర. ఉత్తరకు అభిమన్యునకు జన్మించిన వాడు పరీక్షిత్తు.  పరీక్షిత్తు మహారాజుకు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒక రోజు పరీక్షిత్తు వేటకు వెళ్లాడు. ఒక మృగాన్ని చూచాడు. దానిని తరుముతూ చాలా దూరం వెళ్లాడు. ఒక ఆశ్రమం లోకి ప్రవేశించాడు. అది శమీక మహర్షి ఆశ్రమము. ఆ సమయంలో శమీకుడు మౌన వ్రతంలో కళ్లు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. పరీక్షిత్తు శమీకుడిని చూసి "మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చినదా?" అని అడిగాడు. మౌన వ్రతంలో ఉన్న శమీకుడు జవాబు చెప్ప లేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి శమీకుడి మెడలో వేసాడు. తరువాత హస్తినాపురానికి వెళ్లి పోయాడు. ఇదంతా శమీకుడి శిష్యుడు కృశుడు అనే వాడు చూచాడు. శమీకుడి పుత్రుడు శ్రుంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృశుడు వెళ్లి శృంగికి జరిగినదంతా చెప్పాడు. శృంగికి చాలా కోపం వచ్చింది. "ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజుల లోగా తక్షకుడు అనే సర్ప రాజు చేత మరణించు గాక" అని శాపం ఇచ్చాడు. తరువాత ఆశ్రమా...

Sakuntala Dushyantula katha

  శకుంతల దుష్యంతుల కథ ఇలీనుడి కొడుకు దుష్యంతుడు. దుష్యంతుడు చిన్నప్పటి నుండి అడవులలో తిరుగుతూ సింహాలను, పులులను వెంటాడి పట్టుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్లాడు. అలా వేటాడుతూ దుష్యంతుడు ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది కణ్వాశ్రమము. కణ్వ మహాఋషి తపస్సు చేసుకొనే ఆశ్రమము. ఆశ్రమము. ఆ ఆశ్రమములో బద్ధ శత్రువులైన సింహాలు ఏనుగులు, ఎలుకలు పిల్లులు, చెట్టపట్టాలు వేసుకొని సహజీవనం చేస్తుంటాయి. దుష్యంతుడు తన మంత్రులతో "నేను ఒంటరిగా వెళ్లి కణ్వ మహామునిని దర్శించి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి" అని చెప్పి ఒంటరిగా పాదచారి అయి కణ్వాశ్ర మానికి వెళ్లాడు. కణ్వా శ్రమ సమీపంలో ఒక అందమైన కన్య శకుంతలను దుష్యంతుడు చూచాడు. శకుంతల కూడా అతిలోక సుందరుడైన దుష్యంతుని చూచింది. అతనిని సాదరంగా ఆహ్వానించింది. ఉచిత రీతిన సత్కరించింది. దుష్యంతుడు ఆ కన్యను చూచి "నా పేరు దుష్యంతుడు. ఈ దేశాన్ని ఏలే చక్రవర్తిని. వేట నిమిత్తము ఈ అడవికి వచ్చాను. కణ్వ మహాఋషిని దర్శించుకుందామని ఇక్కడకు వచ్చాను" అన్నాడు. "వారు ...

Jaateeyaalu

  జాతీయాలు  భావ వ్యక్తీకరణకు భాష ఉపయోగపడుతుంది. శ్రోతను ఆకట్టుకునేందుకు, చెప్పే విషయాన్ని మనస్సుకు హత్తుకునేట్లు చెప్పడానికి జాతీయాలు, సామెతలు వాడుతుంటారు. ఇవి భాషకు అందాన్నిస్తాయి, జన వ్యవహారంలోనే కాక సృజనాత్మక రచనల్లోనూ, పత్రిక భాషలోను, శైలి సౌందర్యంకోసం, భావ పటుత్వంకోసం జాతీయాలను ప్రయోగిస్తుంటారు.  జాతీయం ప్రత్యేకత  జాతీయం అంటే - ప్రతి భాషలోనూ జాతీయాలకు ప్రత్యేక స్థానముంది. జాతీయాలు, శైలీసౌందర్యానికి, భావ సౌభాగ్యానికి సమాజ సంస్కృతికి చిహ్నాలు. విషయ నివేదనలో భావగాఢతకు, అలంకార చమత్కృతికి ఇవి ఆలవాలం. ఏ భాషా వ్యవహర్తలయినా ఆ భాషలోని జాతీయాలను ఒంటపట్టించుకొని, సమయానుకూలంగా ప్రయోగించినపుడే భాషలో రాణిస్తారు. ఒక విషయాన్ని స్పష్టంగా, మనుసుకు హత్తుకొనేట్టు చెప్పడానికి, ఆకర్షణీయంగా చెప్పడానికి జాతీయా వాడతారు. జాతీయాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో ఏకపదం కూడా జాతీయం కావచ్చు. జాతీయాలు లక్షణార్థ ప్రాధాన్యం కలవి. ఒక జాతీయంలోని పదాలన్నీ కలిసి సామూహికంగా జాతీయంలోని పదాల అర్థంకాకుండా మరో అర్థానిస్తాయి. జాతీయాలు ఏర్పడే విధానం భాషా వ్యవహారంలో జాతీయాలు ...