కృతయుగంలో కశ్యపప్రజాపతి ఉండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. వినత, కద్రువ. పుత్ర సంతానము కోరి వారు కశ్యపుని ప్రార్ధించారు. కశ్యపుడు వారిని చూచి " మీకు ఎలాంటి సంతానం కావాలి" అని అడిగాడు. కద్రువ తనకు "ప్రకాశ వంతులైన, పొడవైన దేహముగల వెయ్యి మంది కుమారులు కావాలి" అని అడిగింది. వినత కొంచెం ఆలోచించి తనకు "కద్రువ కుమారుల కంటే బలవంతులైన ఇద్దరు సుపుత్రులు కావాలి" అని కోరింది. కశ్యపుడు పుత్రకామేష్టి యాగం చేసాడు. వినత కద్రువలు గర్భం ధరించారు. కద్రువకు వెయ్యి అండ ములు (eggs), వినతకు రెండు అండములు కలిగాయి. వారు ఇద్దరు ఆ అండములను జాగ్రత్తగా కాపాడుతున్నారు.. కొంత కాలానికి కద్రువకు కలిగిన అండములు పగిలి, అందులోనుండి, వాసుకి, శేషుడు, తక్షకుడు మొదలైన సర్పములు (పాములు) బయటకు వచ్చాయి. కాని వినతకు కలిగిన అండములు ఎంతకూ పగలలేదు. వినతకు ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా తను కూడా సంతానం పొందాలని, రెండు అండములలో ఒక అండమును బలవంతముగా చిదిమింది. అందులో నుండి, అపరార్ధ కాయవిహీనుడు (నడుము కింద దేహము లేని వాడు అంటే నడుము నుండి పైన మాత్రమే దేహముకలవాడు, బయటకు వచ్చాడు. అతని పేరు అరుణుడు. అరుణుడు తల్లి విన...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!