Skip to main content

Posts

Showing posts from December, 2021

సూర్య చంద్రులకు రాహువుకు వైరం ఎందుకు?

             దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సము ద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వ తాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చ యించారు.      సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆదికూర్మాను మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిల బడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేసారు. తల వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టుకొని సము ద్రాన్ని చిలకడం ఆరంభించారు.     మొట్ట మొదట సముద్రంలోనుండి హాలా హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠం లో నిలుపుకున్నాడు.     తరువాత, లక్ష్మీ దేవీ, కౌస్తుభ మణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన పక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు, పుట్టాయి. వాటిని మహేం ద్రుడు స్వీకరించాడు. త...

వర్చస్వీయం(కథా సంకలనం) - వర్చస్వి

                 వర్చస్వీయం           సమ్'మోహన'వచనమ్          ముఫ్ఫయ్ పూలు పూయనీండి         కవిత్వానికి వినియోగ విలువ లేదన్నాడో కవి. కళ వల్ల కడుపు నిండేనా కాలు నిండేనా అంటారు మనవాళ్లు. నిజమే. చింతచెట్టు కింద పచ్చికలో పడకేసి లొల్లాయి పదాలు పాడితే ఏంటి ఉపయోగం? జాకబ్ డప్పుకొడుతుంటే శంకర్ గాడు ఊపుగా తీన్మార్ వేస్తే ప్రయోజనమేముంది? ప్లాట్ ఫామ్ మీద పడుకున్న ముసలాణ్ణీ, పక్కన సూటికేసుతో నడిచే షోకు పిల్లినీ చూసి స్కెచ్ బుక్లో చార్కోల్తో గీస్తే ప్రాఫిట్టా పాడా? కానీ ఆదిమ మానవుల నుండి ఆధునిక మానవుల వరకూ ఈ లాభం లేని పని చేయడం ఎన్నడూ ఆపలేదు. యుద్ధాలొచ్చాయి. కరువులొచ్చాయి. వరదలొచ్చాయి. నగరాలొచ్చాయి. నాశనాలొచ్చాయి. అయినా ఈ ‘వినియోగ విలువలేని’ కళ మనిషి వెంటే ఉంది. కెనడా కవి (పేరు గుర్తులేదు) “రేడియంట్ స్పియర్” పుస్తకంలోని చిన్న కవిత చూడండి : మానవుడన్నాడు : ఆనందం మబ్బుల్లో నే తేలిపోతున్నా కవిత్వం చెప్పింది : నేన్నీవెంటే ఉన్నా. మానవుడన్నాడు విషాదం లోతుల్లో నే కూరుకుపోతున్నా కవిత్వం చెప్...

కథా మాలిక - ఏడిద (శానాపతి) ప్రసన్న లక్ష్మి

                                            ముందుమాట          రచయిత(త్రు)లు, తమ తొలి కథలను కొన్ని సంవత్సరాల తరువాత చూస్తే, రాసేవారికి ఎవరికైనా తమ కథలు మరీ అపురూపంగా ఏమీ కనిపించవు. కాలంలో వచ్చిన మార్పులు అప్పుడు తాను రగిలిపోయి బుర్ర పగులగొట్టుకునేలా ఆలోచించి,అక్షరీకరించిన రాసిన కథలు....     ఆ విషయాలను దాటి సమాజం ఎంతో ముందుకు వెళ్ళిపోయి ఉండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ రచయిత్రి తన ప్రారంభ దశలో రాసిన కథలను మన ముందుకు ఎందుకు పెట్టారంటే... ఇవి కథల మాస్టారుగా ఖ్యాతి గడించిన కీ.శే. శ్రీ కాళీపట్నం రామారావు మాస్టారు గారిచే ఎన్నిక చేయబడ్డ కథలు కనుక.    కా.రా మాస్టారు పై అలవిమాలిన అభిమానంతో ఈ కథలను రచయిత్రి ఇక్కడ ఒక మాలికగా రూపొందించే ప్రయత్నం చేస్తూ...ఆ కథల బ్రహ్మకు నివాళిగా అర్పిస్తున్నారేమో అనిపిస్తుంది.       80 వ దశకంలో రచనలు ప్రారంభించిన వారికి... ఒక గొప్ప ఆలంబనగా కా.రా మాస్టారు తను నిర్...

అమ్మ ఒడి

  బాడిగ వెంకట నరసింహారావు (15,8,1913-6.1.1994) కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. 'బాలరసాలు', 'పాలబడి పాటలు', ''ఆవు హరిశ్చంద్ర', 'బాలతనం', 'చిన్నారిలోకం', 'పూలబాలలు' 'ఋతువాణి' వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. 'బాలబంధు'గా ప్రసిద్ధులు, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బాడిగ వెంకట నరసింహారావు పెట్టుకున్నారు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన 'అనార్కలి' నాటకంలో అనార్కలి పాత్ర ధరించి, 'అనార్కలి నరసింహారావు'గా ఖ్యాతి గడించారు. ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బి.వి. నరసింహారావు సంపూర్ణ రచనలు రెండవ సంకలనం లోనిది. కొత్త పదాలు : ఒరవడి = మంచిదారి సుద్దులు = మంచి మాటలు అనిశము = ఎల్లప్పుడు ఒప్పిన = ఆమోదించదగిన బుద్దులు = తెలివితేటలు హాసము = చిరునవ్వు నిత్యము = ఎల్లప్పుడు వికాసము = తెలివి మంజుల భాషణం = అందమైన మాటలు శ్రావ్యము = వినదగిన వీనులు = చెవులు భూషణం = అలంకారము మనసు = హృది అనురాగము = ప్రేమ దివ్యము = చాలా మంచిది భవ్యము = ఉత్తమమైనది యోగము = అదృష్టము కరములు = చేతులు ఆకరములు =...

తీపి గురుతు - ఎమ్మార్వీ సత్యనారాయణ మూర్తి

       తూరుపు తెలతెలవారుతోంది.   ఉదయారుణ కాంతులతో అఖండ గోదావరి మిలమిలా మెరుస్తోంది.    చంద్రశేఖర శాస్త్రి గోదావరిలో మూడుసార్లు మునిగి సూర్య భగవానుడికి అర్ఘ్యమిచ్చి పుష్కరట్ మెట్లు ఎక్కి పైకి వచ్చాడు. శాస్త్రి భార్య సర్వమంగళాదేవి భర్తకి బట్టలు యిచ్చి తానూ స్నానం చేయడానికి వెళ్తున్నానని చెప్పింది.    శాస్త్రి పంచె, లాల్చీ వేసుకొని భార్య రాకకోసం చూస్తున్నాడు.    రైలు కం రోడ్ బ్రిడ్జి మీద నుండి ఎక్స్ప్రెస్ రైలు పెద్దగా శబ్దం చేస్తూ వెళ్తుంది. ఒక్కసారి అటుకేసి చూసిన శాస్త్రి వెంటనే కుడి పక్కకు తిరిగి పాత రైలు వంతెనకేసి తిరిగాడు.     సుదీర్ఘ సేవలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న నిజాయితీపరుడైన ప్రభుత్వోద్యోగిలా మౌనంగా చూస్తోంది పాత రైలు వంతెన.    ఎన్నో పుష్కరాలు చూసిన అనుభవం, ఎంతో మంది ముఖ్యమంత్రులు, గవర్నర్ల డాబూ, దర్పాలూ చూసిన జ్ఞాపకాలు వంతెన గుండెల్లో గూడు కట్టుకొని వుంటాయని భావించాడు.    సర్వమంగళాదేవి గోదావరి స్నానం పూర్తి చేసి, ఒడ్డునే వున్న షెల్టరులోకి వెళ్ళి పొడిబట్టలు కట్టుకొని శాస్త్రి వద్దకు వచ్చిం...