దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని మధించడానికి నిశ్చయించారు. సము ద్రాన్ని ఎలా మధించాలి, దానికి కవ్వం ఏది, తాడు ఏది అని చర్చించ సాగారు. బ్రహ్మ, విష్ణువులతో చర్చిం చారు.. బాగా ఎత్తుగా, పొడవుగా ఉన్న మంధర పర్వ తాన్ని కవ్వముగాను, వాసుకిని తాడుగాను నిశ్చ యించారు. సర్పరాజు అయిన ఆదిశేషువు మంధర పర్వతాన్ని పెకలించాడు. దేవతలు, అసురులు, ఆ పర్వతాన్ని తెచ్చి సముద్రంలో నిలబెట్టారు. కాని అది లోపలకు కుంగి పోతూ ఉంది. ఆదికూర్మాను మంధర పర్వతం కింద ఉంచారు. అప్పుడు మంధర పర్వతం నిటారుగా నిల బడింది. సర్పరాజు వాసుకిని తాడుగా చేసారు. తల వైపు అసురులు, తోక వైపు దేవతలు పట్టుకొని సము ద్రాన్ని చిలకడం ఆరంభించారు. మొట్ట మొదట సముద్రంలోనుండి హాలా హలం పుట్టింది. దానిని మహాశివుడు తీసుకొని తన కంఠం లో నిలుపుకున్నాడు. తరువాత, లక్ష్మీ దేవీ, కౌస్తుభ మణి పుట్టాయి. వాటిని విష్ణువు స్వీకరించి తన పక్షస్థలంలో నిలుపుకున్నాడు. తరువాత ఉచ్చైశ్రవము అనే తెల్లటి గుర్రము, ఐరావతము అనే తెల్లటి ఏనుగు, పుట్టాయి. వాటిని మహేం ద్రుడు స్వీకరించాడు. త...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!