Skip to main content

Posts

Showing posts from November, 2020

ఉదంకుడు : సర్పయాగం ప్రేరణ

      పైలుడి శిష్యుడు  ఉదంకుడు. ఒకరోజు పైలుడి భార్య ఉదంకుని పౌష్యుడు అనే రాజు భార్య వద్ద ఉన్న కుండలాలు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద  వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూశాడు. అతని కోరిక మేరకు ఆవు పేడ భక్షించి, ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత రాజుగారి  వద్దకు వెళ్లి తాను వచ్చిన పని గురించి చెప్పాడు.  పౌష్యుడు రాణిని అడిగి తీసుకోమని చెప్పాడు. ఉదంకుడు కుండలాల కోసం రాణి వద్దకు వెళ్ళాడు‌. కానీ రాణి ఉదంకునికి కనిపించలేదు. మళ్ళీ అతను రాజు వద్దకు వచ్చి, రాణి గారు కనిపించలేదని, ఆ కుండలాలు తమరే తెప్పించి ఇవ్వండని అడిగాడు. అప్పుడు రాజు రాణి అపవిత్రులకు కనబడదని అన్నాడు. అప్పుడు ఉదంకుడు తాను గోమయము భక్షించి ఆచమనము చేయకపోవడం వల్ల అపవిత్రుడను అయినందువల్లే రాణిగారు కనపడలేదని అనుకున్నాడు.         ఉదంకుడు వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమనం చేసి రాణి వద్దకు వెళ్ళాడు. రాణి కనిపించింది. కుండలాలు తీసుకొని రాజు వద్దకు వెళ్ళాడు.           రాజు ఉదంకుని భోజనం చేసి వెళ్ళమన్నారు. ఉదం...

మహాభారతం క్విజ్ -5

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మహాభారతం క్విజ్ -4

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

మందపాలుడు

               పూర్వం మంద పాలుడు అనే మహాముని బ్రహ్మచర్యం పాటించి ఎంతో నిష్ఠగా తపస్సు చేశాడు. కానీ సంతానం లేనందువల్ల పుణ్యలోకాలు పొందలేకపోయాడు. త్వరగా సంతానం పొందడానికి పక్షిగా పుట్టాడు. జరిత అనే ఆడపక్షితో కలిసి నలుగురు కొడుకులను కన్నాడు. వారంతా ఖాండవ వనంలోనే ఉన్నారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు తన కుమారులను రక్షించమని ప్రార్థించాడు. మందపాలుడు. అగ్నిదేవుడు సరేనన్నాడు. ఇంతలో మంటలు దగ్గరికి వస్తున్నాయి. మంద పాలుడు కొడుకులను భూమిలో ఉన్న కలుగు లోకి వెళ్ళమన్నాడు. అప్పుడు మందపాలుని కొడుకులు "తండ్రీ! కలుగులో దాక్కుంటే ఎలుకలు తినేస్తాయి. ఇక్కడ ఉంటే పవిత్రుడైన అగ్నికి ఆహుతి అవుతాం. ఇదే మంచిది కదా? అని అన్నాయి. మంద పాలుడు, జరిత ఏమీ చేయలేక విలపిస్తూ పైకి ఎగిరి పోయారు.  మందపాలుని నలుగురు కుమారులు వేద పఠనం చేస్తూ మాకు అభయం ఇమ్మని ప్రార్థించారు. అగ్నిదేవుడు ఇది విన్నాడు. మీరు మందపాలుని కుమారులని గుర్తుపట్టాడు. మందపాలునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెట్టును వదిలి పక్క నుండి వెళ్ళిపోయాడు.          అలా మందపాలుని కుమారుల...

సుందోపసుందులు

            నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు. వారిద్దరూ బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అయ్యాడు.  ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి వారు తమకు కోరిన రూపం ధరించేటట్లు, వేరే వాళ్ళ చేతిలోను చావు లేకుండా, ఎప్పటికీ చావు లేకుండా వరం కావాలని అడిగారు. కానీ బ్రహ్మదేవుడు వారికి చావు లేకుండా ఉండే వరం తప్ప మిగిలిన అన్ని వరాలు ప్రసాదించాడు. బ్రహ్మ వర ప్రసాదంతో వారు చెలరేగి పోయారు. భూలోకంలో ఉన్న బ్రాహ్మణులను రాజులను బాధ పెట్ట సాగారు. వారి బాధ భరించలేక మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి వారి బాధ నుండి విముక్తి కలిగించమని వేడుకున్నారు. దానికి బ్రహ్మదేవుడు ఆలోచించాడు. వాళ్ళు వేరే వాళ్ల చేతిలో చావు లేకుండా వరం అడిగాడు కానీ ఒకరి చేతిలో ఒకరు చావకుండా వరం అడగలేదు కదా.. అని ఆలోచించి, విశ్వకర్మను పిలిచి ఒక అందమైన స్త్రీని సృష్టించనున్నాడు. విశ్వకర్మ ఒక లోకోత్తర సౌందర్యవతిని సృష్టించాడు. ఆ సుందరి పేరు తిలోత్తమ . ఆమె బ్రహ్మ ముందు నిలబడి తనను సృష్టించిన కారణం ఏమిటని అడిగింది.  బ్రహ్మదేవుడు ఆమెకు సుందోపస...

ద్రౌపది పూర్వ వృత్తాంతం

            పూర్వకాలంలో ఇంద్రసేన అనే ఆమె మౌద్గల్య మహాముని భార్య. ఆమె మహా పతివ్రత. మౌద్గల్యుడు కుష్టురోగం తో బాధపడుతున్నాడు చర్మమంతా వదిలిపోయింది అవయవాలు కూలిపోయాయి కానీ ఇంద్రసేన అసహ్యించు కోకుండా భర్తకు సేవలు చేస్తూ ఉంది‌. ఒకరోజు భర్తకు భోజనం పెట్టింది. మిగిలిన అన్నం తింటూ ఉంది. అందులో భర్త వేలు ఒకటి ఊడి పడి ఉంది. ఇంద్రసేన ఆ వేలుని తీసి పక్కన పెట్టి మిగిలిన అన్నం తింటూ ఉంది. దీన్ని చూసి మౌద్గల్యుడు ఆశ్చర్యపోయాడు.        "ఇంద్రసేన నీ పతిభక్తి అమోఘం. నీకు ఏ వరం కావాలో కోరుకో ఇస్తాను" అన్నాడు దానికి ఇంద్రసేన "నాకు కామవాంఛలు ఎక్కువగా ఉన్నాయి. అవి మీ వల్ల ఈ రూపంలో తీర లేదు‌ కాబట్టి మీరు అందమైన, మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా మారి ఐదు విధాలుగా నా కామవాంఛలు తీర్చండి"అని కోరింది. దానికి ఆ మహాముని సంతోషించాడు. తన తపో మహిమతో మనోహరమైన రూపము ధరించి ఐదుగురిగా విడిపోయాడు. ఐదు విధాలుగా భార్యతో కామ సుఖాలు అనుభవించాడు. తరువాత బ్రహ్మ లోకానికి వెళ్ళాడు.         కానీ ఇంద్రసేనకు కామవాంఛలు ఇంకా తీరలేదు. మర...

మహాభారతం క్విజ్ -3

Loading…                మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి                                                  

తపతి

                 సూర్యుని కూతురు, సావిత్రికి చెల్లెలు అయిన తపతి అనే కన్య మహా సౌందర్యవతి. గుణవతి అజామీఢుని కొడుకు పేరు సంవరణుడు. అతను సూర్యుని గూర్చి తపస్సు చేస్తున్నాడు. సూర్యుడు సంవరణుడే తన కూతురుకి తగిన భర్తనుకొన్నాడు. ఒకరోజు సంవరణుడు అడవికి వేటకు వెళ్లి అలసిపోయి తిరుగుతూ, తపతిని చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను మోహించాడు. ఆమెను "బాలా.. ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు" అని అడిగాడు. కానీ ఆమె బదులు చెప్పకుండా వెళ్ళిపోయింది. సంవరణుడు మోహంతో పిచ్చోడిలా గా ఆమె కోసం వెతుకుతున్నాడు.               తపతి కూడా సంవరణుని మోహించింది. ఒకరోజు తపతి సంవరుణుడికి కనిపించింది. సంవరణుడు తపతిని గాంధర్వ వివాహం చేసుకుంటానన్నాడు. అందుకు ఆమె" నేను సూర్యుని కుమార్తెను, సావిత్రికి చెల్లిని, నాకు స్వాతంత్ర్యం లేదు. నీకు నాపై ప్రేమ ఉంటే నా తండ్రిని అడుగు. మన పెళ్లి జరుగుతుందని చెప్పి వెళ్లి పోయింది. అప్పటినుండి సంవరణుడు అక్కడే ఉండి పట్టుదలతో సూర్యుని ఆరాధిస్తున్నాడు.          ...

పరాశరుడు

            పూర్వం కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఒకరోజు తన సేనలతో అరణ్యానికి వేటకు వెళ్ళాడు. వేటాడి అలసిపోయి సమీపంలో ఉన్న వశిష్ట మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. వశిష్ఠుడు విశ్వామిత్ర మహారాజుకు అతిధి సత్కారాలు గావించాడు.   వశిష్టుని వద్ద నందిని అనే ఒక కామధేనువు ఉంది. విశ్వామిత్రునికి అతని అపార సేన వాహినికి భోజన సత్కారాలు చేయమని నందిని చెప్పాడు. నందిని వారందరికీ ఇష్టమైన వంటకాలతో భోజనం పెట్టింది. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.        లక్ష పాడి ఆవులను ఇస్తానని ఆ కామధేనువును తనకిమ్మని అడిగాడు విశ్వామిత్రుడు. వశిష్టుడు నిరాకరించాడు. బలవంతంగా ఆ కామధేనువును తీసుకురమ్మని తన సేనను ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుడు. నందిని వశిష్ఠుని వైపు చూసింది. వశిష్ఠుడు మౌనంగా చూస్తున్నాడు. నందిని విజృంభించింది. తన శరీరం నుండి సైన్యాలను పుట్టించింది. ఆ సైన్యాలు విశ్వామిత్రుని సైన్యాలను చీల్చి చెండాడారు. విశ్వామిత్రునికి జ్ఞానోదయం అయ్యింది. క్షాత్ర బలం కన్నా తపోబలం గొప్పదని తెలుసుకున్నాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి...

మహాభారతం క్విజ్ -2

Loading…                మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి                                                  

ఏకలవ్యుడు

                దేశదేశాల రాకుమారులు వచ్చి ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నారు. ద్రోణుడి కీర్తి విని హిరణ్యధన్యుడు అనే ఎలుక రాజు కొడుకు ఏకలవ్యుడు ద్రోణుని వద్దకు వచ్చి విలువిద్య నేర్పమని అడిగాడు. కానీ ద్రోణుడు హీనజాతి వాళ్లకు విలువిద్య నేర్పనని తిరస్కరించాడు.  ఏకలవ్యుడు నిరాశతో వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత కౌరవులు పాండవులు వేట నిమిత్తం సమీపంలోని అడవికి వెళ్ళారు. పాండవులకు చెందిన కుక్క ఒకటి తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అతన్ని చూసి మొరగసాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి కుక్క నోటిలో కొట్టాడు. తిరిగి వచ్చిన కుక్కను చూసి రాకుమారులు ఆశ్చర్యపోయారు. ఆ బాణాలు ఎవరు వేశారని వెతుకుతూ అడవులోకి వెళ్ళారు. వారికి ద్రోణాచార్యుని మట్టి విగ్రహం ముందు విలువిద్య సాధన చేస్తున్న ఏకలవ్యుడు కనిపించాడు. ఏకలవ్యుడు రాకుమారులతో తన పేరు ఏకలవ్యుడని, ద్రోణాచార్యుడు తన గురువని చెబుతాడు. రాకుమారులు అక్కడి నుంచి తిరిగి వచ్చి గురువు ద్రోణాచార్యుడుకి ఏకలవ్యుని గురించి చెబుతారు.    ...

ద్రోణుడు

                           భరద్వాజ మహాముని గంగా తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు ఘృతాచి అనే అప్సరస గంగానదిలో జలకాలాడుతూ ఉంది. ఆమె అందానికి  భరద్వాజునికి కామం కలిగి వీర్యం స్ఖలించింది. భరద్వాజుడు ఆ వీర్యాన్ని సేకరించి ఒక ద్రోణిలో పెట్టాడు. ఆ వీర్యం నుండి జన్మించాడు ద్రోణుడు .             భరద్వాజుని స్నేహితుడైన పృషతుడు పాంచాల దేశాన్ని పాలిస్తున్నాడు. అతను కూడా అడవులకు వెళ్ళి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. ఒకరోజు మేనక అనే అప్సరసను చూశాడు. కామంతో వీర్యం పతనమయ్యింది. ఆ వీర్యాన్ని అతడు తన పాదంతో కప్పి వేశాడు. ఆ వీర్యం నుండి ద్రుపదుడు అనే బాలుడు జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాల దేశం వెళ్ళిపోయాడు.    భరద్వాజుని ఆశ్రమంలో ద్రోణుడు, ద్రుపదుడు కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజయ్యాడు. ద్రోణుడు అగ్నివేశ్యుని వద్ద ధనుర్విద్యను నేర్చుకుంటున్నాడు. కృపుని చెల్లెలు అయిన కృపిని వివాహం చేసుకున్నాడు. ఆశ్వత్దామ అనే...

కృపాచార్యుడు

                      గౌతముడు అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి వేదాలు చదవడం ఇష్టం లేదు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు ఇంకా సాధించాలని ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు ను భంగం చేయాలని  దేవేంద్రుడు జలపద అనే యువతిని పంపించాడు. శరద్వంతుడు ఆమెను చూసి పరవశుడయ్యాడు. కామోద్రేకంలో అతనికి  వీర్యస్కలనం అయ్యింది. అతని వీర్యం ఒక రెల్లు పొదల్లో  రెండు భాగాలుగా పడింది. రెండు భాగాల నుంచి ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు.  వేటకు వెళ్ళినప్పుడు ఈ బిడ్డను చూసి  శంతన మహారాజు తనతో పాటు తీసుకు వచ్చి పెంచుకున్నాడు. వారికి కృపుడు , కృపి అని పేర్లు పెట్టాడు. కొంతకాలం తర్వాత శరద్వంతుడు శంతనుని వద్దకు వచ్చి ఆ పిల్లలు తమ సంతానం అని  తెలిపిత స్వయంగా కృపునికి ధనుర్విద్య నేర్పాడు.            మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి                              ...

కర్ణుని జననం

                                        శూరసేనుడు యాదవరాజు. అతని పెద్ద కూతురు పేరు పృధ .  ఈ శూరసేనుని  మేనత్త కొడుకు కుంతిభోజుడు . అతనికి పిల్లలు లేనందువల్ల తన పెద్ద కుమార్తె అయిన పృధను పెంచుకోవడానికి  దత్తత ఇచ్చాడు. పృధ కుంతి భోజనం ఇంట కుంతి అనే పేరుతో పెరుగుతూ వుంది.                  ఒకరోజు  దూర్వాసుడు  కుంతి భోజుని భవనానికి  వచ్చారు. కుంతి చేసిన సత్కారాలకు సంతృప్తి చెంది ఆమెకు ఒక వరాన్ని ప్రసాదించాడు. ఆ వర ప్రభావం వల్ల ఆమె ఏ దేవత ఆరాధిస్తే ఆ దేవతలు  ఆమెకు కోరిన కొడుకులను ప్రసాదిస్తారు.                  ఒకరోజు కుంతి ఒంటరిగా గంగా నది ఒడ్డుకు వెళ్ళింది. స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం విడిచింది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది మహర్షి వరాన్ని పరీక్షించాలనుకుంది. సూర్యుని తలుచుకుంటూ  మంత్రాన్ని జపించింది. వెంటనే...

మహాభారతం క్విజ్ -1

Loading…          మహాభారతం పూర్తి కథ కోసం కింది లింకును క్లిక్ చేయండి  

విదురుని పూర్వ వృత్తాంతం

                                  విదురుని జననం                           మాండవ్యుడు అనే మహర్షి  ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకొని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు రాజు గారి ధనాన్ని దోచుకొని, సైనికులు వెంటపడుతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమంలో దాక్కున్నారు. అటుగా వచ్చిన సైనికులు మాండవ్యునితో 'ఎవరైనా దొంగలు ఇటు వచ్చారా?' అని అడిగారు. మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు జవాబు ఇవ్వలేదు. సైనికులు ఆశ్రమంలో ప్రవేశించి అక్కడ ఉన్న దొంగలను పట్టుకున్నారు మాండవ్య మహామునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి దొంగల తోపాటు మాండవ్యుని కూడా బంధించి రాజు గారి సమక్షంలో ప్రవేశపెట్టారు. రాజుగారు ఆ దొంగలకు మరణ శిక్ష విధించారు. దొంగలకు సహాయం చేసినట్లు అనుమానిస్తున్న మాండవ్యునికి ఇనుప శూలం మీద కూర్చోబెట్టాలని శిక్ష విధించారు. కానీ మాండవ్యుడు ఆ శిక్షకు భయపడక తపస్సు చేసుకుంటున్నాడు ఒక రోజు రాత్ర...

మహాభారతం - ఆదిపర్వము

                                       మహాభారతం             తిం టే గారెలే తినాలి ..  వింటే భారతమే వినాలని నానుడి.  దీన్ని బట్టి మహాభారతం యొక్క గొప్పదనం తెలుస్తూ వుంది. గారెలు వంటికి బలం..  భారతం మనసుకు బలం. ఈ కావ్యంలో లేనిదంటూ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో లేనిదంటూ ఈ కావ్యంలో లేదు. అంత గొప్ప కావ్యం ఇది.  ప్రపంచంలో  వున్న వివిధ మనస్తత్వాలను కూలంకషంగా చర్చించిన కావ్యం మహాభారతం. అటువంటి ఈ కావ్యాన్ని అందరూ చదవాలి.  అందుకే  ఈ కావ్యంలోని పాత్రలను సంక్షిప్తంగా పరిచయం చేయదలచి ఈ బృహత్కార్యాన్ని నిర్వహించదలిచి అందరి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను.                     ఈ కావ్యాన్ని  వ్యాసమహర్షి  సంస్కృతంలో  వంద  పర్వాలుగా   రాశారు.  ఈ వంద పర్వాల మహాభారతాన్ని తెలుగులో   కవిత్రయం గా పేరుగాంచిన  నన్నయ ,  తిక్కన, ...