పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఒకరోజు పైలుడి భార్య ఉదంకుని పౌష్యుడు అనే రాజు భార్య వద్ద ఉన్న కుండలాలు తీసుకురమ్మని పంపింది. ఉదంకుడు ఆ పని మీద వెళుతుండగా దారిలో ఒక దివ్య పురుషుని చూశాడు. అతని కోరిక మేరకు ఆవు పేడ భక్షించి, ఆ దివ్య పురుషుని అనుగ్రహం పొందాడు. తరువాత రాజుగారి వద్దకు వెళ్లి తాను వచ్చిన పని గురించి చెప్పాడు. పౌష్యుడు రాణిని అడిగి తీసుకోమని చెప్పాడు. ఉదంకుడు కుండలాల కోసం రాణి వద్దకు వెళ్ళాడు. కానీ రాణి ఉదంకునికి కనిపించలేదు. మళ్ళీ అతను రాజు వద్దకు వచ్చి, రాణి గారు కనిపించలేదని, ఆ కుండలాలు తమరే తెప్పించి ఇవ్వండని అడిగాడు. అప్పుడు రాజు రాణి అపవిత్రులకు కనబడదని అన్నాడు. అప్పుడు ఉదంకుడు తాను గోమయము భక్షించి ఆచమనము చేయకపోవడం వల్ల అపవిత్రుడను అయినందువల్లే రాణిగారు కనపడలేదని అనుకున్నాడు. ఉదంకుడు వెంటనే తూర్పు తిరిగి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఆచమనం చేసి రాణి వద్దకు వెళ్ళాడు. రాణి కనిపించింది. కుండలాలు తీసుకొని రాజు వద్దకు వెళ్ళాడు. రాజు ఉదంకుని భోజనం చేసి వెళ్ళమన్నారు. ఉదం...
దేశ భాషలందు తెలుగు లెస్స! మాతృభాష కన్నమధురమైనదేది!!